సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల పాస్టర్స్ మలేషియా మందిరం నుండి మఠంపల్లి మెయిన్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవుల పై దాడులు, స్త్రీలపై బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగించి ఆ స్త్రీల యొక్క తండ్రిని తమ్ముని చంపివేసి గోతిలో పాతి పెట్టి,అంతేకాకుండా స్త్రీలను అత్యాచారం చేసి వారిని చంపడం జరిగింది .కానీ మణిపూర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూడు నెలల నుండి ఆ యొక్క ఉన్మాదుల పై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం ఈ యొక్క భారత దేశంలో మత స్వేచ్ఛ కలిగిన భారతదేశం గా పేరు ఉన్నది. ఆర్ఎస్ఎస్ గుండాలు ఇళ్లల్లో జొరబడి ప్రార్థన చేస్తున్న వారిని చంపుతున్నారు .కావున క్రైస్తవులకు మణిపూర్ ప్రభుత్వం రక్షణ కల్పించాలని మఠంపల్లి మండల పాస్టర్ లు అందరూ కలిసి డిమాండ్ చేశారు . ఈ యొక్క ర్యాలీలో హుజూర్నగర్ నియోజకవర్గం నుండి పాస్టర్ ఎం దేవస్థానం మఠంపల్లి మండల అధ్యక్షులు ఐజాక్ పాస్టర్ కార్యదర్శి పి రవి , దాస్ బాబు , సతీష్ , కే కుపా నందం , కే ఇమ్మాని యేల్ , ఆదం , మనిషా, మాస్టర్ ప్రసాద్ ,ధనుంజయ్, చిలక దేవా బిక్షం,ఏసు దాసు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin