సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన జి.బుచ్చి బాబు ఇటీవల ఆన్లైన్ యాప్ ద్వారా రూ.3 వేల విలువైన డ్రస్ కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేశాడు. చెల్లింపులో సమస్య ఏర్పడిం దనీ. తాము ఒక లింక్ పంపుతామని. ఆ లింక్ ద్వారా నగదును చెల్లించాలని గుర్తు తెలి యని వ్యక్తులు బుచ్చిబాబుకు సూచించారు. ఆ లింక్ ఓపెన్ చేసి పాస్వర్డ్ నమోదు చేశాడు. కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.96 వేలు మరోఖాతాకు బదిలీ అయి నట్లు బాధితుడి సెల్ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. దీంతో కంగుతిన్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ మోస గాళ్లు అప్పటికే నగదును ఆ ఖాతాలో లేకుండా ఖాళీ చేశారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో చింతకాని ఎస్సై పొదిలి వెంకన్న కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు...
-----------------------
Admin