సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నర్సంపేట మండలంలో జరిగింది. స్థానికుల ప్రకారం... రంగంపల్లి గ్రామానికి చెందిన రజిత (44) వ్యవసాయ బావిలో మృతదేహమై కనిపించింది. అయితే బావి వద్ద రజిత చెప్పులు కనిపించడంతో భర్త అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Reporter