Thursday, 30 July 2026 08:19:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి... - ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్

Date : 27 April 2025 01:11 AM Views : 837

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణబాబు అధ్యక్షనలో షెడ్యూల్డ్ ప్రాంత చట్టాల అమలుకై 5 మే 2025 ములుగు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ భూభాగంలో ఆదివాసుల షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలు రక్షణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపై కుట్టిల కుతంత్రాలు చేస్తూ ఆదివాసుల జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసుల చట్టాలు నిర్వీర్యం చేస్తూ ఆదివాసుల జీవన మరణ పోరాటంలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతలలో 1/70 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ భూములు మరికాల(జెడ్), అంకన్న గూడెం(జెడ్) వాడగూడెం(జడ్) వీరభద్రారం(జడ్) వెంకటాపురం(జడ్)లలో వలస గిరిజనేతరులు ఆక్రమించి అక్రమ పట్టాలను పొందియున్నారు సమగ్ర విచారణ జరిపి రద్దు చేయాలని ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. ఆదివాసుల స్వయంపాలన సాధికారత సాధించేందుకు రూపొందించిన రాష్ట్ర షెడ్యూల్డ్ ప్రాంత పంచాయతీల విస్తీరణ చట్టం( పెసా) అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ఆదివాసి ప్రాంతాలలో పంచాయతీ రాజ్ సంస్థల మౌలిక స్వరూపం వాటి అధికారాలు సూచించవలసిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దిలీప్ సింగ్ భూరియా అధ్యక్షతన కమిటీని నియమించింది.షెడ్యూల్డ్ ప్రాంతలలో గ్రామసభలకు విస్తృత అధికారాలు సిఫార్సు చేస్తూ భూరియా కమీటి 1995లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని అన్నారు. పీసా నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని, షెడ్యూల్ ప్రాంత చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు, ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, సోడి గోపి, కేక్కెం తేజ, సూరిటి నవదిప్, మిడియం అర్జున్, బొగ్గుల రాంబాబు, బొగ్గుల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :