సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేరేడుచర్ల పట్టణంలో నిర్వహించనైనది. యిట్టి సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల , గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు . చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేసి , 53 రోజుల తర్వాత విడుదలైన సందర్భంగా హాజరై ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనందున మొక్కవోని ధైర్యంతో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వారు సూచించిన విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ పరిధిలోని అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని టీడీపీ సీనియర్ నాయకులు పాల్వాయి రమేష్ అధ్యక్షతన జరిపిన సమావేశంలో ఏక గ్రీవ తీర్మానం చేసినారు. ఇట్టి సమావేశంలో పొనుగోటి జంగారావు , ఇంజమూరి వెంకటయ్య , బెల్లంకొండ రామజోగి , షేక్ అలీ , నేలపట్ల అంజయ్య గౌడ్ , పాతకోటి లింగారెడ్డి , పోలగాని సురేష్ గౌడ్ , పచ్చిపాల వెంకన్న యాదవ్ , తిరుమలగిరి గోవింద్ , రావిరాల లింగయ్య , కొనకౕంచి సైదులు , నెమ్మాది సుందరయ్య, వెంకట్రామ్ నాయక్ , బొగ్గవరపు వీరభద్రరావు , బొమ్మకంటి బ్రహ్మయ్య , షేక్ లాల్ ఏనుగంటి పుల్లయ్య చౌదరి , యడవెల్లి వెంకటరెడ్డి మరియు వివిధ హోదాలలో గల నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin