సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండల కేంద్రంలో హలో నేను ఏఎస్ఐ ని మాట్లాడుతున్నా... మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. రూ 75 వేలు పంపిస్తున్నా వెంటనే ఫోన్ పే ద్వారా నాకు తిరిగి ఆ మొత్తాన్ని పంపండి అంటూ ఫేక్ కాల్ చేసి ఇరువురు వ్యక్తులను మోసగించి ఓ గుర్తుతెలియని ఆగంతకుడు సైబర్ నేరానికి పాల్పడిన సంఘటన నేరేడుచర్లలో వెలుగు చూసింది.ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయంలో నేరేడుచర్లలోని ఓ బంక్ యజమానికి నేను ఏఎస్ఐ ని మాట్లాడుతున్నా నని ఫోన్ వచ్చింది. మా ఎస్ఐ కూతురికి యాక్సిడెంట్ అయింది. నా దగ్గర నగదు మాత్రమే ఉంది. రూ 75 వేలు పంపుతున్నాను "నా అకౌంట్ లోకి ఫోన్ 'పే ద్వారా పంపండి అని ఫోన్ వచ్చింది. దీంతో ఆ బంక్ యజమాని నా వద్ద ఫోన్ పే లేదని సమాధానం చెప్పడంతో మీకు తెలిసిన వారి నుండి పంపించండని ఆదేశించాడు. దీంతో సదరు బంకు యజమాని పట్టణానికి చెందిన మిత్రుడి నెంబరు ఇచ్చాడు.ఆగంతకుడు మిత్రుడి నెంబర్ కి ఫోన్ చేయగా ఆ మిత్రుడి వద్ద సరిపోను మొత్తం లేకపోవడంతో మరో వ్యక్తిని పిలిపించుకొని ఇరువురు ఫోన్ పే ద్వారా ఆగంతకుడు చెప్పిన మరో పెట్రోల్ బంక్ సిబ్బంది అకౌంట్ కు పంపించాల్సిందిగా చెప్పాడు. తిరిగి ఆగంతకుడు పెట్రోల్ బంక్ సిబ్బందికి ఫోన్ చేసి నీకు ఖాతాకు డబ్బు చేరిందని నేను పంపిన క్యూఆర్ కోడ్ కు డబ్బు పంపమని చెప్పగా పంపించాడు. ఏఎస్ఐ పంపిస్తానన్న డబ్బు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి 1930 సైబర్ క్రైమ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
-----------------------
Admin