సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు, శతజయంతి ఉత్సవాలు బిజెపి పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు మాట్లాడుతూ. అటల్ బిహారి వాజ్పేయి ఆరు సంవత్సరాల సుపరిపాలన లో ఎన్నో చరిత్ర ఆత్మకమైన నిర్ణయాలు అమలుతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని, నిబద్ధతకు నిలువెత్తు రూపం అటల్ బిహారీ వాజ్పేయి. మాతృభూమికి తన జీవితాన్ని అంకితం చేసి, దేశ అభివృద్ధికి బాటలు పరిచి ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన మహ నీయుడి అడుగుజాడల్లో నేటి యువత పయనించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు మాదాల సూర్యనారాయణ, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దొంత బాదరయ్య, తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin