సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల మండలంలోని వివిధ గ్రామాలలో, ప్రజలు బీఎస్పీ అభ్యర్థి రాపోలు నవీన్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. నేరేడుచర్ల మండలానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి మోసాలను ప్రజలు ఆయనకు చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటేస్తామని ఆయా గ్రామాల ప్రజలు హామీ ఇవ్వడం జరిగింది.ప్రచారంలో బాగంగా ప్రజలనుద్దేశించ రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలంటే, చనేరేడుచర్ల మండలంలోని గ్రామాలు తండాలు అభివృద్ధి జరగాలంటే మండలానికి కార్పొరేట్ స్థాయి పాఠశాల రావాలంటే మరియు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు కలిగిన హాస్పిటల్ రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగు ఉపేందర్, నియోజకవర్గ ఇంచార్జి కొండమిది నర్సింహా రావు, మండల కన్వీనర్ పెద్దపంగ ఉపేందర్, మండల అధ్యక్షులు తకెళ్ళ నాగార్జున, అమరవరపు వెంకటేశ్వర్లు, బొజ్జా పవన్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin