సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల నందు ఎస్పీ ఆదేశాల మేరకు మఠంపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు షీ టీమ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో మఠంపల్లి ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికల రక్షణకై ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ బృందం వారికి ఎంతో ఉపయోగపడుతుందని, వారు ఆకతాయిలతో ఏదైనా సమస్య ఉన్నచో షీ టీమ్స్ సంప్రదించి రక్షణ పొందవచ్చు అని, అదేవిధంగా విద్యార్థులు సైబర్ నేరాలపై పూర్తి అవగాహనతో ఉండాలని ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత, విద్యార్థులు పలు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని తెలుసుకొని వాటి లింక్స్ ని ఓపెన్ చేస్తూ మోసపోతున్నారని, అట్టి సైబర్ నేరగాళ్ల నుండి తమని తాము కాపాడుకునేందుకు పూర్తి అవగాహనతో ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై బాలకృష్ణ విద్యార్థులకు తెలియజేశారు.అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ వారు సమస్యలను మీకు స్వేచ్ఛగా చెప్పే విధంగా వ్యవహరించాలని సూచించారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మఠం పల్లి పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు....
-----------------------
Admin