సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం ఎంకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎవరికి భయపడకండి కొండా లక్ష్మణ్ బాపూజీల పోరాటం ప్రతిమ ఉండాలి ఎందులోనూ తక్కువ కాదు అని పద్మశాలి కులస్తులు అన్ని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే తనను గెలిపించాలని గెలిచిన వెంటనే కుల సంఘాల భవనాలు పద్మశాలి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి బాధ్యత తనది అని అన్నారు. అభివృద్ధిలో పద్మశాలి కులస్తులు ముఖ్య భూమిక పోషించాలని కోరారు. అవినీతి పాలనకు ముగింపు పలికి దేశం కోసం ధర్మం కోసం బిజెపికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ ఎమ్మెల్యే మోహన్ జీ మహతే, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ పల్లెపురాజు, ఆర్మూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, జీవి నరసింహ రెడ్డి, నూతల శ్రీనివాస్, ద్యగా ఉదయ్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు.
-----------------------
Admin