సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : ICDS మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలోని "MJPT బీసీ సంక్షేమ పాఠశాల"దుబ్బతండా లో సీడీపీఓ మమత ఆధ్వర్యంలో "ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు "కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, బాలల పై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీడీపీఓ మమత మేడమ్ మాట్లాడుతూ బాలల హక్కుల గురించి, బాల్య వివాహాలు, బాలికల యొక్క Safe touch & Unsafe touch గురించి ,బాలికలు మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పైన అవగాహన కలిగి ఉండాలని ,బాలికలను ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులకు దైర్యంగా వ్యక్తపరచాలని వివరించారు. చదువు యొక్క ప్రాముఖ్యత గురించి, మరియు వ్యక్తిగత పరిశుభ్రత మరియు బాలికలకు అవసరమైన సమతుల ఆహారం మరియు పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా జిల్లా మహిళా సాధికారత నుండి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొని బాలికలు మంచిగా చదువుకొని ,సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమం గురించి,పొక్సో చట్టం గురించి, బాలికల వివాహ వయసు గురించి, చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ గురించి వివరించడం జరిగింది.పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఏమైనా బాలికలకు సమస్యలు ఉంటే వారికి తెలియజేయాలని ,చక్కగా చదువుకోవాలని వివరించారు.అదేవిధంగా కార్యక్రమం అనంతరం బాలికలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వ్యాస రచన పోటీ నిర్వహించి మొదటి, రెండవ, మూడవ బహుమతులను సీడీపీఓ మేడమ్ అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు: 1.పాఠశాల ప్రిన్సిపాల్ మేడం -ఉమాదేవి 2.టీచర్-నస్రీన్ ,అజీత 3.సూపర్వైజర్ లు - వాణి, రాధిక, సుశీల, హేమదేవి, పద్మ, నజీమా బేగం 4.BC-కవిత 5.అంగన్వాడీ టీచర్లు-సక్కు
-----------------------
Admin