సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామంలో మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను అంగన్వాడి పాఠశాలల్లో చేర్పించలని పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి టీచర్లు అవగాహన కల్పించడంజరిగింది. అదేవిధంగా ఆ వయసు పిల్లలను అంగన్వాడిలో చేర్పించడం వలన పిల్లల్లో మొదలయ్యే ఎదుగుదల గురించి అంగన్వాడీ టీచర్లు క్షుణ్ణంగా తల్లిదండ్రులకు వివరించారు. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీలో చేర్పించడం వలన పిల్లల్లో మానసిక ఉల్లాసం మరింతగా పెరుగుతుందని వారు తెలియజేశారు. పిల్లల పెరుగుతున్న వయసును గుర్తుంచుకొని వారికి ప్రాథమిక పాఠశాల పై అవగాహన కలిగే విధంగా అంగన్వాడి పాఠశాలలో మాత్రమే నేర్పడం జరుగుతుందని వారు తెలియజేశారు. పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ "అమ్మ మాట అంగన్వాడి బడిబాట" అంటూ వారు గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. వారు చేసిన ఈ అంగన్వాడి అవగాహన ర్యాలీ సదస్సు మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల తల్లిదండ్రులు వినియోహించుకోవాలని తెలియచేసారు. అమ్మ మాట అంగన్వాడీ బడి బాట కార్యక్రమములో ఎంమ్ రమాదేవి , బి విజయ, బి తార, వి నాగవేణి వీరితో పాటు మరికొంత మంది ఆశ వర్కర్స్ పాల్గొన్నారు...
-----------------------
Admin