సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ గడ్డపై గెలిచేది నిలిచేది చివరకు టిఆర్ఎస్ పార్టేనని స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. గురువారం టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుండి కార్యకర్తలు పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్ నగర్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగిందని అన్నారు. రెండు పర్యాయాలు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని మూడో పర్యాయం కూడా గెలిపిస్తే షాద్ నగర్ అసెంబ్లీలో కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎల్లప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపక్షం అనీ ప్రజలు ఎన్నికల్లో పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin