Tuesday, 15 September 2026 05:47:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ధాన్యం కొనుగోలు లో జరిగే అవకతవకలను నివారించాలి...

Date : 04 November 2023 12:04 PM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ధాన్యం కొనుగోలు గురించి మన హుజూర్ నగర్ పట్టణ కేంద్రంగా అనేక సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు బస్తా ఒక్కంటికి రెండు కేజీల ధాన్యం తగ్గించి లెక్క చేయడం, దీనికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘాలు, వామపక్షాలు, అనేకసార్లు మిల్లర్లతో చర్చించినారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్యపై అనేకసార్లు వీధి పోరాటాలు, అధికారులతో జాయింట్ సమావేశాలు నిర్వహించిన సమస్య మాత్రం అపరిచికృతంగానే మిగిలిపోయింది. గత పది సంవత్సరాలుగా ఈ సమస్యపై రైతు సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ఈ సమస్యపై స్థూలంగా ఒక అంగీకారానికి వచ్చిన అమలు చేయడంలో జాప్యం జరిగింది. ఈ సంవత్సరం వరి కోతలు ప్రారంభం అవుతున్నందున ఇట్టి విషయాన్ని రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి విషయాన్ని. క్వింటాళ్లలో ఖరీదు చేయడాన్ని అఖిలపక్ష రైతు సంఘాల తో చర్చించాలని కోరినాయి. ఈ విషయమై రైస్ మిల్లర్ల ప్రతినిధులు స్పందిస్తూ రైతు సంఘాలు మా దృష్టికి తెచ్చినటువంటి విషయాన్ని మా సంఘం సమావేశంలో చర్చించి మీ సంఘాలకు కబురు చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకపోతే వేలాదిమంది రైతులతో హుజూర్ నగర్ నడిబొడ్డు లో ధర్నా . రాస్తారోకో చేపడతామని ఈ విషయాన్ని అధికారులు దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు మేకల నాగేశ్వరరావు, కొప్పోజు సూర్యనారాయణ, దుగ్గి బ్రహ్మం, కంబాల శ్రీనివాస్, కాకి అజయ్, టీజేఎస్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, మురళి, బిక్షం, పూర్ణచంద్రరావు, నర్సిరెడ్డి రైస్ మిల్లు యాజమాన్యం నుండి అధ్యక్షులు పోలిశెట్టి నరసింహారావు సీనియర్ నాయకులు గెల్లి అప్పారావు, గజ్జి ప్రభాకర్, దొంగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :