Wednesday, 29 July 2026 08:15:52 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇప్పటివరకు 2 కోట్ల 45 లక్షల 76 వేల రూపాయలు స్వాధీనం ....

Date : 07 November 2023 07:30 AM Views : 281

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తనిఖీలలో పట్టుబడిన 109 కేసులకు సంబంధించి రెండు కోట్ల 45 లక్షల 76 వేల రూపాయల్లో 2 కోట్ల 15 లక్షల 62 వేల 860 రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అల ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల 45 లక్షల 76 వేల రూపాయలు నగదు పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుకున్న నగదుకు సంబంధించి సంబంధిత వ్యక్తులు సమర్పించిన ఆధారాలను తనిఖీ చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటి, 2 కోట్ల 15 లక్షల 62 వేల నగదును విడుదల చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులకు ఎప్పటి కప్పుడు స్పందిస్తు తగు చర్యలు తీసుకుంటున్నామని పట్టుకున్న సమయంలో ఇచ్చిన రసీదు, తగిన ఆధారాలతో ఐడిఓసి కార్యాలయంలోని గ్రీవెన్స్ కమిటికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల్లో అక్రమాలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, డబ్బులు ఆశ చూపడం, మద్యం సరఫరా చేయడం, నేరపూరిత చర్యలకు పాల్పడినా, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేసినా ఫొటోలు, వీడియోలు తీసి ఈ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చునని చెప్పారు. సి విజిల్, 1050 కంట్రోల్ రూములకు వచ్చిన ఫిర్యాదులను జిల్లాలోని కమాండ్ కంట్రోల్ రూం సిబ్బంది ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తారని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోతే అధికారులు బాధ్యులవుతారని ఆమె పేర్కొన్నారు. ఓటుహక్కు వినియోగంపై కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుతో పాటు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడల్లులో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలన్నారు. స్వీప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగాలని, పోలింగ్ తక్కువ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగంపై కళాజాత కార్యక్రమాలు ద్వారా విస్తృత ప్రచారం చేయాలని డిపిఆర్వో ను ఆదేశించారు. షాపింగ్ మాల్స్ వద్ద సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేపించాలని స్వీప్ నోడల్ అధికారిని ఆదేశించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :