సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ప్రజాభవన్ (టౌన్ హాల్) నందు రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఐదవ వార్షిక మహోత్సవ సమావేశాలను విజయవంతం చేయాలని రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గజ్జి ప్రభాకర్ దేవులపల్లి సుబ్రమణ్య శర్మ లు తెలిపారు. స్తానిక రామకృష్ణ సేవా సమితి లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామకృష్ణ_ వివేకానంద బావ ప్రచార పరిషత్ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా జనవరి 20 శనివారం రోజు ప్రజాభవన్ లో ఉదయం విద్యార్థుల సదస్సు సాయంత్రం యువజన సదస్సు కార్యక్రమం ---22న ఆదివారం ఉదయం ఉపాధ్యాయ సదస్సు, సాయంత్రం తల్లిదండ్రుల సదస్సు కార్యక్రమం నిర్వహించబడును . రామకృష్ణ- వివేకానంద బావ ప్రచార పరిషత్ ఐదవ వార్షిక వేదాంత గోష్టి బృహత్ భక్త సమ్మేళనంలో పట్టణ ప్రజలు యువతీ యువకులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు ఓరుగంటి నాగేశ్వరరావు, కామిశెట్టి నందయ్య, చిట్టెంశెట్టి అనిల్ కుమార్, నంద్యాల ఉపేందర్ రెడ్డి, సుందర రాఘవరావు, చందా ప్రసాద్,దేవరం శ్రీధర్ రెడ్డి ,శివయ్య ,వంకాయల రామలింగయ్య ,గురు స్వామి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin