సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం వడ్డీ వారి పల్లి అంగన్వాడి సెంటర్ లో అంగన్వాడీ కార్యకర్తలు అందరికి ఎంపిడిఓ పోలప్ప అధ్వర్యంలో మీటింగు నిర్వహించారు.మండలంలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లు సక్రమంగా జరగాలని, ప్రీ స్కూల్ ప్రణాళిక ప్రకారం జరగాలని,మెనూ ప్రకారం ఫుడ్ వండి పిల్లలకు తల్లులకి పెట్టాలని,టైం ప్రకారం సెంటర్లు జరపాలని, అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన సోషల్ వెల్ఫేర్ తనిఖీకి వచ్చినప్పుడు అంగన్వాడీ కార్యకర్త సహకరించాలి. జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలకు తనిఖీ ప్రత్యేక అధికారులను నియమించారు. ఎప్పుడైనా తనిఖీ చేయొచ్చు రికార్డులు, స్కూల్ అటెండెన్స్ గా ఉండేలాగా చూసుకోవాలి, బాలింతలకు, గర్భవతులు, అంగన్వాడి పిల్లలకు వచ్చిన వైఎస్ఆర్ కిట్లు, పాలు, గుడ్లు, బాల అమృతం వచ్చినటువంటి సక్రమంగా వాళ్లకు చేరేలాగా చూడాలి, బియ్యం, దాల్, ఆయిల్, వంటివి డీలర్ల దగ్గర నుండి సక్రమంగా అందడం లేదని అంగన్వాడి కార్యకర్తలు ఎంపీడీవో పోలప్పకు తెలియజేయడం జరిగింది. కొంతమంది రేషన్ డీలర్లు బియ్యం, దాల్ ,ఆయిల్ ,సరుకులు సక్రమంగా ఇవ్వని పక్షంలో నా దృష్టికి తీసుకురండి అని ఎంపీడీవో పోలప్ప అంగన్వాడి కార్యకర్తలకు తెలియజేశారు....
-----------------------
Admin