సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల శ్రీలత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 7వ వార్డు,8వ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. చల్ల శ్రీలతక్క కు మహిళలు పలికారు . హుజూర్ నగర్ ఆడబిడ్డగా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. బిజెపి కమలం పువ్వు ఓటు వేసి శ్రీలతక్కను గెలిపిస్తామని ప్రజలు ప్రమాణాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చల్ల శ్రీలతక్క మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న వ్యక్తిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin