సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటుచేసిన వైయస్సార్ జయంతి వేడుకలకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే పోదేంవీరయ్య పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఘనంగా వారికి పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు సారపాక సెంటర్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేక్ కటింగ్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. అనంతరం బూర్గంపాడు మండలం సారపాక లో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న సమ్మెకు మద్దతు తెలియజేసిన పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులు న్యాయమైన కోర్కెలపై సమ్మె చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మరో మూడు నెలల్లో అధికారంలోకి వస్తుందని అప్పుడు అన్ని సమస్యలు తీరుతాయని కార్మికుల సమ్మెకు మద్దతు తెలియజేస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా గిరిజనులకు పోడు భూముల పట్టాల విషయంలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గిరిజనులకు పోడు భూములు పట్టాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని హామీ ఇచ్చారు మరియు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన సంక్షేమ కార్యక్రమాలన్నీ నెరవేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది సోనియా గాంధీ అని మరోసారి ప్రజలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు అధికార పార్టీ మొద్దు నిద్రలో ఉందని త్వరలోనే వారికి కనువిప్పు కలిగి చేస్తామని పేర్కొన్నారు. వారు కోరే కోర్కెలని న్యాయమైనవిని వారి కోరికలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin