సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండల్ ఎంపీడీవో ఆఫీసులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు విద్యాధికారి డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో ఫరూఖ్ నగర్ మండల్ లోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జాతీయ నులిపురుగుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 20వ తారీకు గురువారం రోజున జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాలు లోపు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రను మింగించాలని ఉపాధ్యాయులు అందరికీ తెలియజేశారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ ఒకటి నుండి రెండు సంవత్సరముల మధ్య వయస్సు పిల్లలకు ఆఫ్ టాబ్లెట్ క్రష్ చేసి పిల్లలకు మింగించాలని, రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరముల వయస్సు వున్న పిల్లలు కు ఆల్బెండజోల్ ఒక టాబ్లెట్ నోట్లో నమిలించి మ్రింగించాలని చెప్పారు. 3 సంవత్సరం నుంచి 19 సంవత్సరంలో పిల్లలందరికీ కూడా ఒక ఆల్బెండజోల్ టాబ్లెట్ మ్గించాలని తెలియజేశారు. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించడం వలన పిల్లల కడుపులోని నులిపురుగులు చనిపోయి పిల్లలు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని తెలియజేశారు. పిల్లల కడుపులో నులిపురుగులు ఉండడం వలన వారు తీసుకున్న హారము ఆ నులిపురుగులే భుజించడం వలన పిల్లల ఎదుగుదల తగ్గి, పిల్లలు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలను కోల్పోతున్నారు అని చెప్పారు. అందువలన 20వ తారీకు గురువారం రోజున 1 సంవత్సరం నుండి 19 సంవత్సరంలో పిల్లలందరికీ కూడా ఒక ఆల్బెండజోల్ మాత్రం తప్పకుండా మింగించాలి అని డాక్టర్ స్రవంతి గారు తెలియజేశారు. 20వ తారీకు రోజున మిస్సయిన పిల్లలందరినీ మళ్లీ 27వ తారీకు రోజున ఆల్బెండజోల్ మాత్ర తప్పకుండా మింగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల్ ఎంఈఓ శంకర్ రాథోడ్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎంఎల్ హెచ్ పి వైద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, ఫరూఖ్ నగర్ మండల్ సంబంధించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-----------------------
Admin