సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నల్లమడ మండలం ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని నల్లమాడ మండలం మసకవంక పల్లి గ్రామానికి కేటాయిస్తే, విధులు మాత్రం గోపేపల్లి లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. మసకవంకపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పుట్టపర్తి లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ప్రజల వద్దకే పాలన పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా మసక వంకపల్లి గ్రామానికి సచివాలయాన్ని కేటాయించగా,సచివాలయ సిబ్బంది అక్కడ నిర్వహించకుండా ఆ గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపేపల్లి లో విధులు నిర్వహించడం జరుగుతుందని,తమ గ్రామానికి రోడ్డు మార్గం సక్రమంగా లేకపోవడంతో సుదూరంగా ప్రయాణించి సచివాలయానికి వస్తున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్ధులు సచివాలయ సేవలను, రైతు భరోసా సేవలను, విలేజ్ క్లినిక్ అందించే సేవలను వినియోగించుకొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
-----------------------
Admin