సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకొని మామిడిపల్లిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నిజాంబాద్ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈరోజును ' సౌర్య దివాస్ ' గా నిర్వహించడం జరుగుతా ఉందని. నేతాజీ సుభాష్ చంద్ర జయంతులే తప్ప వర్దంతులు ఎరగని ఓ గొప్ప యోధుడని. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ కు నేతాజీగా పిలవడం జరిగిందని. ఈ దేశానికి మొట్టమొదటిసారిగా దేశ ప్రధానిగా 1943 అండమాన్ నీకోబార్లను స్వాధీనం చేసుకొని ఈ దేశ ప్రధానిగా భారతీయ జాతీయ పథకాన్ని ఎగురవేయడం జరిగిందని. యువతను దేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడానికై ఉత్తేజ పరుస్తూ మీరు రత్నాన్ని ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తాను నినాదించిన వ్యక్తి అని. నేతాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత పెడదారు పట్టకుండా ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి యువత నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, ఖా oదేశ్ ప్రశాంత్, గోవింద్ పెట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పసుపుల సాయి, విజయ సాగర్,మాజీ వార్డ్ మెంబర్ భూమేష్ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin