Saturday, 18 April 2026 08:16:06 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 127 జయంతిని ఘనంగా నివాళులు అర్పించిన బిజెపి పార్టీ...

Date : 24 January 2024 10:54 AM Views : 380

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకొని మామిడిపల్లిలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నిజాంబాద్ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈరోజును ' సౌర్య దివాస్ ' గా నిర్వహించడం జరుగుతా ఉందని. నేతాజీ సుభాష్ చంద్ర జయంతులే తప్ప వర్దంతులు ఎరగని ఓ గొప్ప యోధుడని. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ కు నేతాజీగా పిలవడం జరిగిందని. ఈ దేశానికి మొట్టమొదటిసారిగా దేశ ప్రధానిగా 1943 అండమాన్ నీకోబార్లను స్వాధీనం చేసుకొని ఈ దేశ ప్రధానిగా భారతీయ జాతీయ పథకాన్ని ఎగురవేయడం జరిగిందని. యువతను దేశ స్వతంత్రం కోసం పోరాటం చేయడానికై ఉత్తేజ పరుస్తూ మీరు రత్నాన్ని ఇవ్వండి నేను స్వతంత్రాన్ని ఇస్తాను నినాదించిన వ్యక్తి అని. నేతాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత పెడదారు పట్టకుండా ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి యువత నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, ఖా oదేశ్ ప్రశాంత్, గోవింద్ పెట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి పసుపుల సాయి, విజయ సాగర్,మాజీ వార్డ్ మెంబర్ భూమేష్ బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :