సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్. ప్రభాకర రావు, ఏ.సి.పి, ఆర్మూర్ ఆద్వర్యం లో బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, మరియు ,సిబ్బంది. కలిసి ఆర్మూర్ లోని RTC బస్టాండ్ లో గంజాయి అక్రమ రవాణా మరియు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నిన్న తేదీ: 26.10.2022 నాడు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసు వారిని చూసి పారిపోతున్న A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లను పట్టుకుని విచారించగా A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లకు గత కొన్ని రోజుల నుండి ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎండు గంజాయిని అమ్మి వెళతాడని, అతను అమ్మిన ఎండు గంజాయిని A-1/ అజయ్, A-2/ అజయ్ @ అజయ్ శర్మ లు మెట్పల్లి మరియు డిచ్పల్లి పరిసర గ్రామాలలో గంజాయి తాగే వారికి ఎక్కువ ధరకు అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారని విచారణలో తెలినది. శ్రీ.ఆర్. ప్రభాకరరావు, ఏ.సి.పి, ఆర్మూర్ ఆద్వర్యం లో బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్, బి. శివరామ్ SIP, ASI శ్రీ షేక్ గఫ్ఫార్, మరియు కానిస్టేబుల్స్ అయిన శ్రీ. K. గంగా ప్రసాద్ PC 1699, శ్రీ .D. ప్రసాద్ PC 1899 ను నేడు పోలీస్ కమిషనర్ శ్రీ కే.ఆర్. నాగరాజు, IPS అభినందించి వీరికి రివార్డ్ లు ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎ.సి.పి శ్రీ. ప్రభాకర రావు, బి. సురేశ్ బాబు, ఇన్స్ పెక్టర్ ఆఫ్' పోలీస్ ఆర్మూర్ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin