సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.పోతుల జ్ఞానయ్య మున్సిపల్ కమిషనర్ ని కలిసి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న కనీసం మన రాష్ట్రంలో ను హుజూర్ నగర్ పట్టణం లోను మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం సిద్ధించిన రోజున అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి రోజున అలాగే మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున మన ప్రభుత్వం మనదేశంలో మద్యం మాంసం విక్రయాలను నిషేధించిన విధముగా సువిశాల భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 న కనీసం మన రాష్ట్రంలో ను అదేవిధంగా ఈ పట్టణం లోను మద్యం మాంసం విక్రయాలను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్టర్ పోస్టుల ద్వారా అలాగే హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ద్వారా విన్నవించనైనది. వినతి పత్రం సమర్పించిన వారు బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.పోతుల జ్ఞానయ్య ,డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్.దగ్గుపాటి బాబురావు , పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొట్టే ముక్కల రాములు మాజీ వార్డు మెంబర్ తుమ్మ కొమ్మ యోన వినతిపత్రం సమర్పించినారు...
-----------------------
Admin