సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రష్టి, శ్రీ రత్నాకర్ గారి మాతృమూర్తి శ్రీమతి మీనాక్షమ్మ గారి నాలుగో వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున వారి సమాధి వద్ద పుష్పాలతో నివాళులర్పించారు. మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారితో పాటు, అధికార పక్ష ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీడుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సందర్శించిన శ్రీ రత్నాకర్, తమ మాతృమూర్తి వర్ధంతి సందర్భంగా బీడుపల్లి ప్రభుత్వ హైస్కూల్లోలో చదువుతున్న 250 మంది బాల బాలికలకు రత్నాకర్ తమ చేతుల మీదుగా స్కూల్ బ్యాగులు, విద్యా సమగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను సేవించడం, పూజించడం చిన్నతనం నుంచి నేర్చుకోవాలని చెప్పారు. పేదరికం అనుభవిస్తునా, చదువు అనే ఆయుధంతో పేదరికాన్ని జయించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా వారు పిల్లలకు పిలుపునిచ్చారు. శ్రీ సత్య సాయి జిల్లా పాఠశాల ప్రాంగణాలలో మౌలిక వసతులు ఏవైనా ఏర్పాటు చేయవలసి ఉంటే తమ దృష్టికి తేవాలని ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని వారుకోరారు. తమ పాఠశాలను సందర్శించి పిల్లలకు ఎంతో ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఈ సందర్భంగా బీడుపల్లి హై స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రత్నాకర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రహమతుల్లా , శ్రీ రమణ , శ్రీమతి రాజేశ్వరి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
-----------------------
Admin