Thursday, 30 July 2026 10:38:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలి ...

Date : 14 December 2023 02:18 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా నడుస్తూ ఉచితంగా ప్రజాసేవ,ప్రభుత్వ సేవ చేస్తున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా జర్నలిస్టు స్కీం తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల మంది పాత్రికేయ కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు.మీడియా సహాయం లేకుండా ఏ ఒక్కరూ అధికారంలోకి రాలేరని తెలిపారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడంతోపాటు హెల్త్ కార్డులు,ప్రభుత్వ గుర్తింపు కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇప్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలన్నారు.జర్నలిస్టులకు వృత్తిరీత్యా తగిన గౌరవ మర్యాదలు గుర్తింపును ప్రభుత్వం ఇవ్వాలన్నారు.జర్నలిస్టులకు ఇంటి స్థలాలు లేదా ప్రత్యేక గృహాన్ని నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీంతోపాటు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మీడియా సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న వారి కి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి జర్నలిస్టుల కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అవ్వాలని కోరారు.నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు శాసన సభ్యులందరికీ అసోసియేషన్ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :