Saturday, 18 April 2026 06:23:41 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు… జైలు శిక్ష తప్పదు! ప్రభుత్వం కఠిన హెచ్చరిక

Date : 30 December 2025 09:25 PM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్పంచ్ ఉప సర్పంచ్ కు ప్రభుత్వం కఠిన హెచ్చరిక జాయింట్ చెక్ పవర్ దుర్వినియోగమైతే పదవి ఊడటమే కాదు.... జైలు శిక్ష తప్పదు! జాయింట్ చెక్కు పవర్ ప్రాముఖ్యత గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకం కీలకమైన భద్రతా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది. అభివృద్ధి పనుల కోసం వెచ్చించే ప్రతి రూపాయికి వీరిద్దరి ఆమోదం తప్పనిసరి. అయితే వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా చెక్ పవర్‌ను అడ్డుకోవడం గ్రామాభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పారదర్శకతతోనే చట్టపరమైన రక్షణ గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి సంబంధించిన ప్రతి నిర్ణయం తప్పనిసరిగా గ్రామసభ తీర్మానం ద్వారానే జరగాలని ఆదేశించారు. నగదు లావాదేవీలకు బదులుగా ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఖర్చుల వివరాలను సమయానుకూలంగా రికార్డుల్లో నమోదు చేయడం ద్వారా ఆడిట్ తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. పారదర్శకత పాటిస్తేనే ప్రజా ప్రతినిధులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని హెచ్చరించారు.అధికార దుర్వినియోగానికి కఠిన శిక్షలు ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడటం, పనులు పూర్తికాకుండానే బిల్లులు డ్రా చేయడం, తప్పుడు లెక్కలు చూపడం, సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటువంటి అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పదవి నుంచి తొలగించడమే కాకుండా జైలు శిక్ష విధించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని పేర్కొంది.ఆధిపత్య పోరుతో అభివృద్ధికి బ్రేక్ కొన్ని గ్రామాల్లో సర్పంచ్ – ఉప సర్పంచ్ మధ్య ఆధిపత్య పోరు అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని అధికారులు గుర్తించారు. రాజకీయ కారణాలతో కావాలనే బిల్లులపై సంతకాలు చేయకుండా పనులను నిలిపివేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించింది. విచారణలో అభివృద్ధిని అడ్డుకున్నట్లు తేలితే, ఉప సర్పంచ్‌కు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసే అధికారం కలెక్టర్‌కు ఉందని స్పష్టం చేసింది.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :