సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని ఆదివారం విద్యానగర్ కాలనీ, అశోక్ నగర్, గాజుల రాజo బస్తి 25 వార్డు ఏర్పాటుచేసిన గణేష్ మండపాలను సందర్శించి వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి సభ్యులు కె.వి రంగా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా కిరణ్ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా ఈ యొక్క వినాయక నవరాత్రీ ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, అలాగే ఈరోజు ఇంత పెద్ద ఎత్తులో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో చింతలచెరువు శ్రీనివాస్, బాబు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin