సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్నఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నవభారత నిర్మాణంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసంప్రతి ఒక్కరు కృషిh చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈఓ ఎస్. ఎస్. రావు,నాయకులు జలంధర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin