సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నల్గొండ పట్టణంలో, మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ (NPL) క్రీకెట్ టోర్నమెంట్... ప్రారంభించిన , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడటం జరిగింది.. ఈ సందర్భంగా MLA బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు వారి కుమారుడి జ్ఞాపకార్థం యువతను క్రీడల్లో ప్రొచ్చహించాలి అనే లక్ష్యంతో వారికి గత 5సంవత్సరాలుగా నల్గొండలో క్రీకెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. వారి కుమారుడు మరణించిన బాధలో ఉండి కూడా నల్గొండ ప్రజలు అంతా తన కుమారుడితో సమానంగా భావించి ప్రతీక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత 13 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అన్నారు జిల్లా వ్యాప్తంగా కోమటి రెడ్డి బ్రదర్స్ అంటేనే పేద, బడుగు బలహీనర్గాలకు అండ దండగా ఉంటారనే పేరు తెచ్చుకున్న గొప్ప నాయకులు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin