సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ ఖానాపురం ఖానాపూర్ మండలం నాజీతండాలో గతంలో సుమారు 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యుత్ తీగలు కిందికి వేలాడి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్నందున, ఈ సమస్యను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాఖమూరి హరిబాబు, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల జగన్మోహన్ రెడ్డి, సహకారంతో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి దృష్టికి నాజి తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు .మోహన్ నాయక్, సురేష్ నాయక్, హరిలాల్ నాయక్ ఆధ్వర్యంలో. మనవి చేయగా ఈ సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందించిన విద్యుత్ శాఖ వారు తండాలో ఉన్న విద్యుత్ సమస్యను పరిశీలించి నూతన పోల్స్. మిడిల్ పోల్స్, డ్యామేజ్ పోల్స్, అదనపు పోల్స్ తో పాటు మరొక 30కేవీ డిటిఆర్ పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నాజీ తండా విద్యుత్. సమస్యను పరిష్కరింప చేస్తున్నందుకు. నాజీ తండా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
-----------------------
Reporter