సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రకృతి వైపరీత్యాలకు పేద ప్రజల ఇళ్లు కూలి నిరాశ్రయులయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా మేము ఉన్నాం అంటూ ఎమ్మెల్యే అంజయ్య దండు గ్రామాలకు కదిలింది. పార్టీ శ్రేణులు ప్రజా ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ చిన్న కుమారుడు వై. మురళీకృష్ణ యాదవ్ సైతం గ్రామాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే అంజన్న దండు బాధితులను ప్రత్యేకంగా కలుసుకుంటున్నారు. ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు, గృహా లక్ష్మీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఫరూఖ్ నగర్ మండలం మేళ్ళగూడ తండా, వెంకన్నగూడ తండా, వెలిజర్ల, గంట్లవెళ్ళి, కొండన్నగూడ గ్రామాలలో 45 మందికి వీరు సాయం అందించారు. స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆదేశాలతో గ్రామాలకు కదిలిన అంజన్న సైన్యం బాధితుల ఇండ్లకు వెళ్లి పరిస్థితులు సమీక్షించి వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. అంతేకాదు ప్రభుత్వం ద్వారా గృహలక్ష్మి పథకాన్ని వర్తిస్తామని స్థానిక ఎంపీపీ ఖాజా అహ్మద్రి ఇద్రిస్ తదితర ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని 45 మంది బాధితులకు ఆర్థిక సాయంతో పాటు నిత్యవసర వస్తువులు అందజేశామని పేర్కొన్నారు. అంతేకాదు గృహలక్ష్మి కింద ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హామీ ఇచ్చారని బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేద ప్రజలకు అండగా నిలుస్తారని వారి యోగక్షేమాలే ఆయనకు ముఖ్యమని, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైనా పేద ప్రజలకు న్యాయం చేయడం తధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin