సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లా : 23/8/2023 న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జె.వి.ఎల్ శిరీష పాల్వంచ మండలం ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మామిళ్ళగూడెం, రేగులగూడెం గ్రామాలలో జరుగుచున్న I R Spraying కార్య క్రమాన్ని సందర్శించడం జరిగినది. మరియు అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు అనగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులనుండి రక్షణ పొందుటకు IR Sprayingచేయడం జరుగుతున్నదని, అదే విధంగా దోమలు నిల్వ లేకుండా ఉండాలని ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, దోమతెరలను వాడాలని, తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఉలవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin