Wednesday, 29 July 2026 08:00:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాన్ పహాడ్ సైదులు దర్గా ఉత్సవాలు...

Date : 26 January 2024 08:59 AM Views : 446

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో రెండవ అతిపెద్ద దర్గా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ గ్రామంలోని సైదన్న దర్గా జనవరి 25 6 నుండి 27 28 తేదీ వరకు జరుగు ఉత్సవానికి తెలంగాణ జిల్లాలైన నల్లగొండ మహబూబ్నగర్ ఖమ్మం హైదరాబాదు రంగారెడ్డి వరంగల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు ఆదాయం మిన్న అభివృద్ధి సున్నా వేల సంఖ్యలో దర్గా దర్శనానికి వస్తున్న భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో వక్స్ఫర్డ్ అధికారులు దర్గా కాంట్రాక్టర్లు విఫలం చెందారు దర్గా ప్రాంతాల్లో స్థానాల గదులు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి మహిళలు బట్టలు మార్చుకొనుటకు చిన్నచిన్న స్థానపు గదులు ఉన్న వాటికి తలుపులు కూడా లేవు మరుగుదొడ్లు మూత్రశాలలు లేక బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేస్తూ దర్గా పరిసర ప్రాంతాలలో పారిశుద్ధత లోపించి దుర్గంధపు వాసన వస్తుంది చల్లటానికి అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు ప్రతి సంవత్సరం జరిగే వరసి ఉత్సవాలలో ఈ సమస్యలే దర్శనమిస్తూ ఉన్న దర్గా కాంట్రాక్టర్లు గాని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు అధిక సంఖ్యలలో వాహనాలు వస్తున్నా పార్కింగ్ లేక పార్కింగ్లలో వాహనాలను పార్కింగ్ చేసిన అధిక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సమస్య వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది దర్గా దగ్గర మద్యం అమ్మరాదని నిషేధం ఉన్న అక్రమంగా మధ్యమేరులై పారుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసి చూడనట్లు వ్యవహరిస్తుంది. కబ్జా గురైన దర్గా భూములను రక్షించాలని అక్రమాలకు పాల్పడుతున్న దర్గా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని భక్తుల నుండి అక్రమంగా వసులో పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు దర్గాకు వచ్చే ఆదాయం నుండి దర్గా అభివృద్ధికి ఖర్చు చేయాలి ఊరికి వచ్చే వాళ్ళు ఏ సమస్యలు దర్శనమిస్తున్నాయి ఎన్ని విజ్ఞప్తులు చేసినా దున్నపోతుపై వర్షం పడిన చందాన ఉంటుంది ప్రభుత్వ మారిన ఎమ్మెల్యేలు మంత్రులు మారిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన దర్గాలో ఉంటుంది జాన్పాడుదర్గా దగ్గర ఏది కొందామన్నా రూపాయకి మూడు రూపాయల అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు ఇదేమిటంటే ఇక్కడ ఇంతే మీరు కొంటే కొనండి లేకపోతే లేదు అని మాట్లాడుతున్నారు . గుడి పరిసర ప్రాంతాలలో ముజావర్ వారి కుటుంబ సభ్యులు ఆడినదే ఆట పాడినదే పాట గుడి లోపల సైదన్న సమాధులపై ఉంచిన దట్టిని ముట్టుకోవాలన్న కాసులు కుమ్మరించాల్సిందే కొబ్బరికాయకు ఒక రేటు తాయత్తుకు ఒక రేటు సైదన్న సమాధులపై దుస్తులకు ఒకరు అన్నట్టుగా ముజావర్ వస్సూలు చేస్తూ వ్యవహరిస్తున్నాడని భక్తులు వేడుకుంటున్నారు ఆర్టీసీ అధికారులైన కనీసం వరుసగా ఉర్సు జరిగే రోజున బస్సుల సంఖ్యను పెంచి ప్రయాణికుల సమస్యల తీర్చాలని కోరుకుంటున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :