సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సోమవారం రోజున సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి ధారా కవిత సుబేదారి పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాల శుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది వ్యవహరించే తీరు, స్పందన వేగం, మహిళా–పిల్లల ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను కూడా వివరంగా సమీక్షించారు.డీసీపీ గారు ప్రజల్లో నేరాల నివారణపై అవగాహన పెంచే దిశగా పోలీస్ సిబ్బంది మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా మారక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్లు వంటి నేరాలపై గ్రామ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తరించాలని ఆదేశించారు. యువతలో డ్రగ్స్ పెరుగుతున్న ప్రమాదం గురించి ప్రత్యేకంగా చర్చిస్తూ, విద్యాసంస్థలు–కాలేజీలు–పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
-----------------------
Reporter