సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : 2024లో ప్రధాని మోదీ ఇంటికి వెళతారని. తాము ఢిల్లీకి వెళతామని తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం సభలో అన్నారు. బీజేపీకి పెట్టుబడిదారి దోపిడీ దారి ప్రభుత్వమని మండిపడ్డారు. దేశంలో ఎన్నో వనరులు ఉన్నాయని. కానీ వాటిని వినియోగించుకునే తెలివి కేంద్రానికి లేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి ప్రైవేటైజేషన్ పాలసీ అని. తమది మాత్రం నేషనలైజేషన్ పాలసీ అని తెలిపారు. రాజకీయాలు జరుగుతుంటాయని. గెలుపు ఓటములు సహజమని కేసీఆర్ అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారత సమాజం లక్ష్యం కోల్పోయినట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అందరూ సీరియస్గా ఆలోచించాలని సూచించారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. అన్నీ ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సభలో బీఆర్ఎస్ జాతీయ విధానం చెప్పడం సాధ్యంకాదని. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని కేసీఆర్ అన్నారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందని అన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉందని. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని అన్నారు. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా? అని వ్యాఖ్యానించారు. రూ. లక్ష కోట్ల విలువైన పామాయిల్ దిగుమతి చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్ 4. 10లక్షల మెగావాట్లు అని. కానీ దేశం ఎప్పుడూ కూడా 2. 10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదని అన్నారు....
-----------------------
Admin