సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ పోలీసుల వినూత్న చర్య.. రౌడీషీటర్లతో రోడ్డుపై కవాతు.సబ్ డివిజన్ లోని అజాం జాహి మిల్స్ కాలనీ ఠాణా నుంచి ఖిలా వరంగల్ తహసీల్దార్ ఆఫీస్ వరకు నడక.మండుటెండలో రౌడీషీటర్లను నడిపించుకుంటూ తీసుకెళ్లిన సీఐ రమేష్,ఎస్సైలు.ఖిలా వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఎదుట రౌడీషీటర్ల బైండోవర్!ముందు పోలీసులు,వెనుక జీపులు.. మధ్యలో రౌడీషీటర్ల మార్చ్.నేరస్తులకు వణుకు పుట్టించేలా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల యాక్షన్. *నర్సంపేట ఏసిపి కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఏసిపి రవీందర్ రెడ్డి.* వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీబీ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఏసిపి రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో నర్సంపేట,దుగ్గొండి,నెక్కొండ సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
-----------------------
Reporter