సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సర్కార్ టీవీ ప్రతినిధి రాయల్ నవీన్ : బూర్గంపాడు మండలం, సారపాక గ్రామంలో గల కపర్తి భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ టి సి ఎఐటియుసి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సింగమనేని ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కామ్రేడ్ పేరాల శ్రీనివాస్, మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలని నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావని జనం కోసం జీవిస్తే జనాల హృదయంలో నిలిచిపోతారని, మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలని అందుకు దేవుడు మీద గాని మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దని గొప్పగా చెప్పిన మహానుభావుడని. ఎందరో తలరాతలు మార్చిన అపర మేధావి మన భారతదేశంలో పుట్టటం మనమందరం చేసుకున్న గొప్ప పుణ్యమని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పనిచేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంటరానితనంతో అనేక నిందలను ఎదుర్కొని ఆ నిందలనే ఆయుధంగా మార్చుకొని ప్రపంచంలోకెల్లా అపరివేధావిగా పేరు తెచ్చుకున్న వారు డాక్టర్ అంబేద్కర్ గారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐటిసి ఏఐటీయూసీ కాంటాక్ట్ కార్మికుల అధ్యక్షులు బల్లెం నాగయ్య ,ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, సిహెచ్ స్వామి గౌడ్, అనిల్ కుమార్ శర్మ , పత్యం ఉపేందర్, ఉపాధ్యక్షుడు కోటమర్తి శ్రీనివాస్, పారుపల్లి శ్రీనివాస్, కోరుకుంట్ల వెంకటేశ్వరరావు, గంట నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...
-----------------------
Reporter