Tuesday, 15 September 2026 05:41:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెన్నా సిమెంట్ వారిచే 38వ మైన్స్ సేఫ్టీ వార్షికోత్సవ వేడుకలు...

Date : 26 December 2023 01:45 AM Views : 297

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్గొండ జిల్లా, దామరచర్ల మండలంలో ఉన్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 38వ మైన్స్ సేఫ్టీ వారోత్సవాలు నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న ఎస్.పి కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారు 69 మైన్స్, మరియు 37 సిమెంట్ కంపెనీల అధికారులు, ఉద్యోగస్తులు, కార్మికులు హాజరైనారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, దన్ బాద్ ప్రభాత్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ భూషన్ ప్రసాద్ సింగ్, భూషన్ ప్రసాద్ సింగ్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ, హైదరాబాద్ రీజియన్-1 ఉమేష్ మధుకర్ రావు సావర్కర్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున డి. లక్ష్మీకాంతం డైరెక్టర్ (టెక్నికల్), టి.శ్రీధర్ రెడ్డి ప్రెసిడెంట్ (ఆపరేషన్స్), పెన్నా సిమెంట్ గణేష్ పహాడ్ ప్లాంట్ హెడ్ మరియు ఎం.ఎస్&పి.ఎ. చైర్మన్ షేక్ మహబూబ్ బాషా, ఎం.ఎస్.&పి.ఎ సెక్రటరీ ఎం.రాంచందర్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గనులలో పనిచేసే వారంతా భద్రత పరికరాలను తప్పని సరిగా దరించి భద్రతతో కూడిన పనివిధానాన్ని అవలంబిస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారమే వుండదని తెలియజేశారు. ఇట్టి వార్షికోత్సవ కార్యక్రమములో సాంస్కృతిక కార్యక్రమములు, నృత్యాలు, పాటలతో అలరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన గనుల ఉద్యోగులు, కార్మికులందరికి జోనల్ మరియు రాష్ట్ర పరిధిలో బహుమతి ప్రదానం చేశారు. ఈ యొక్క కార్యక్రమములో అధికారులు, ఉద్యోగులు, వర్కర్స్ తదితరులు సుమారు 2,500 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :