సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రానికి గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి,అర్చక సంఘం అధ్యక్షులు శ్రీ కొంకపాక వెంకటేశ్వర శర్మ సంతాప సభ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సైది రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ శంకర్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి బోగాల బాల వెంకట్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు, బచ్చు శ్రీనివాస్ రెడ్డి,మండల కార్మిక శాఖ అధ్యక్షులు సాముల వెంకట్ రెడ్డి,గ్రామశాఖ అధ్యక్షులు కూన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ప్రధాన అర్చకులు రాధ కృష్ణ మూర్తి, ముడెమ్ రాజశేఖర్ రెడ్డి,సుభాని,సుంకరి శివ గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin