Wednesday, 29 July 2026 05:35:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చిమ్మచీకట్లో "ప్రకాశం స్టేడియం గ్రౌండ్"

Date : 21 September 2023 11:05 AM Views : 272

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కోట్ల రూపాయల లాభాలతో దూసుకుపోతున్న సింగరేణి సంస్థ పర్యవేక్షణలో ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో కనీస సౌకర్యాలు లేవని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రకాశం సేయడం గ్రౌండ్లో కలియతిరిగారు.ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన క్రీడాకారులు,వాకర్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కామేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో రంజి క్రికెట్ మ్యాచ్లు నిర్వహించిన చరిత్ర ఉందని గుర్తు చేశారు.వేల కోట్ల రూపాయల లాభాలతో సింగరేణి సంస్థ దూసుకుపోతుందని తెలిపారు.కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో క్రీడాకారులకు కనీస వసతులు ఏర్పాటు చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.సమావేశాలు,సభలకు అనుమతులు ఇచ్చే యాజమాన్యం స్టేడియం గ్రౌండ్ చుట్టూ గుంతలు పేరుకుపోయి ఉన్నా,వాటిని పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని అన్నారు.సాయంకాలం వేళల్లో వాకర్స్,క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకున్నందుకు గ్రౌండ్ కు విచ్చేస్తే కనీసం విద్యుత్ దీపాలు ఉన్నా,వాటిని వెలిగించడంలేదని ఆరోపించారు.గ్రౌండ్ చుట్టూ కలుపుమొక్కలు పేరుకుపోవడంతో విషసర్పాలు సైతం తిరుగుతున్నాయని అన్నారు.కార్మిక ప్రాంతమైన కొత్తగూడెంలో క్రీడాకారుల కోసం యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భావ్యం కాదన్నారు.ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు కనీసం మంచినీటి సౌకర్యం సైతం లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి, సందెలా సందీప్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :