సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని మంగళవారం రోజు నియోజకవర్గ కేంద్రం లో MRPS జిల్లా కార్యదర్శి సండ్ర నాగరాజు మాదిగ అధ్యక్షతన ఎమ్మార్పీఎస్,ఎం ఎస్పి, అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ముఖ్య అతిథులుగా కాటేపాక శంకర్ లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తక్షణమే అమలు చేయాలని ప్రధాన డిమాండ్ తో ఫిబ్రవరి 3వ తేదీన హైదరాబాదులో వేలగొంతుల లక్షలాది డప్పుల మాదిగల మహా ప్రదర్శన జయప్రదం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎస్సీ వర్గీకరణ అమలు జరిగేంతవరకు ఈ రాష్ట్రంలో ఎటువంటి నియామకాలు చేపట్టవద్దని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం వేలాది గొంతులు లక్షలాది డబ్బులతో మాదిగ, పీడిత కులాల కళా బృందాలతో, ప్రతి మాదిగ పల్లెలో కాళ్లకు గజ్జ కట్టి, మాదిగ డప్పు చప్పులతో వివిధ కళారూపాలతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని వారు తెలియజేశారు.అందుకు జనవరి 7 నుండి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో మాదిగ కళాబృం లతో పెద్ద ఎత్తున మాదిగ కళా చైతన్య రధాలు నియోజక వర్గం మొత్తం సంచరిస్తూ చైతన్యం చేస్తాయని జనవరి 7 వ తారీఖున ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంగా వేలాదిమంది ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల కార్యకర్తలతో జిల్లా సదస్సులు ఉంటాయని ముఖ్య అతిథిగా : మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు విచ్చేస్తారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సందాల శంబయ మాదిగ , లక్ష డప్పులు వేల గొంతుల ప్రచార కార్యదర్శి పాలడుగు అంజి మాదిగ , మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి రేవూరి ప్రతాప్ మాదిగ , MRPS మిర్యాలగూడ మండల అధ్యక్షులు మహంకాళి సురేష్ మాదిగ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ధైదా శ్రీను మాదిగ, అధికార ప్రతినిధి దైదా సురేష్ మాదిగ, కొట్రా గోవర్దన్ మాదిగ, వల్లదాసు నాగయ్య మాదిగ, పోలేపాక సురేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin