సర్కార్ టీవీ న్యూస్ / ఆసిఫాబాద్ జిల్లా : రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా భాజపా ఎమ్మెల్యేలు పాయల శంకర్ రామారావు పటేల్ గారు రాకేష్ గారు .హరీష్ బాబు. గారి తదితరులు ఎడ్ల బండి పై అసెంబ్లీకి వెళ్లారు ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన రైతుల సమస్యలను పరిష్కరించలేక పోయిందని ఆయన అన్నారు రైతుల సమస్యలపై శాసనసభలో చర్చ జరగాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు పంట బీమా రైతు భరోసా పథకాల అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన అన్నారు...
-----------------------
Admin