సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ గారిపై అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.బుధవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీతో 100 కోట్లకు బేరమడి అడ్డంగా దొరికిన దొంగ బాలరాజు అని అటువంటి వంటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింన ప్రవీణ్ కుమార్ సర్ కోసం మాట్లాడే స్థాయి కూడా కాదని తెలుసుకుంటే మంచిదాని హితవు పలికారు.రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారని ఇది సరైంది కాదన్నారు,పెద్దవాళ్ళును విమర్శిస్తే పెద్ద నాయకుడిని అయిపోతామనుకుంటే అది వారి అవివేకనికి నిదర్శనమన్నారు.బాలరాజు వెంటనే ప్రవీణ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే గువ్వల బాలరాజుకు అచ్చంపేట లో తగిన బుద్ధి చెబుతామని,బాలరాజు ఖబడ్దార్ అని హెచ్చరించారు ఈకార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి,లలిత,సరోజ,అనిల్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin