సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రేపు నిర్వహించబోయే సాధారణ సమావేశం అవినీతి అక్రమాలతో కూడిన 18 అంశాలతో ప్రధానంగా మొక్కల పేరున "గ్రీన్ బడ్జెట్" పేరు పెట్టి మరో అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షుడు ధ్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా ఎమ్మెల్యే క్యాంప్ సిబ్బందికి మున్సిపాలిటీ సాదరణ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మాన కాపీ తో పాటు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి, బిజెపి నిజాంబాద్ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు రెడ్డి మాట్లాడుతూ రేపు నిర్వహించబోయే మున్సిపాలిటీ సాధన సమావేశము 18 అంశాలతో కూడినటువంటి ఎజెండా ను పెట్ట బోతున్నామని. ప్రధానంగా మొక్కల పేరున పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు, స్కాముకు తెర లేపడం జరుగుతుందని. ఈ యొక్క స్టాండ్ గ్రీన్ బడ్జెట్ అనే పేరు పెట్టి దాదాపు 25 లక్షలు రూపాయలు స్కామ్ జరగబోతుందని. మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి మూడు వేల మొక్కలు విషయం అడగడంతో ఆ మొక్కలను డంపింగ్ యార్డ్ లో పడేసి మొక్కలు నాటినట్టుగా వాటిపై కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుందని అంతేకాకుండా ఆర్మూర్లో కుక్కల బెడద,పందుల బెడద,దోమల బెడద, చివరికి కోతుల బెడద, తీవ్రమైపోయినప్పటికీ అదే విధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్డు భయానకంగా మారి ఆ రోజుల్లో నడిచినా, ప్రయాణం చేసిన ఆస్పత్రి పాలు కావడం గ్యారెంటీగా మున్సిపాలిటీ పనిచేస్తా ఉందని అలాంటి విషయంలో చొరవా చేసుకోవాల్సిన మున్సిపాలిటీ అవినీతి అక్రమాలకు భూకబ్దలకు తప్ప అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ ఉందని జూన్ 2 నా జరిగే తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు తీసుకువచ్చినటువంటి మిఠాయిలకు సైతం 33 వేల రూపాయలు ఖర్చు అయినట్టుగా దొంగలెక్కలు రాయడం జూన్ 2 యొక్క సందర్భాన్ని అవమానపరిచినట్టుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుందని. అంతేకాకుండా మిషన్ భగీరథ పేరున ప్రజలకు ఉచితంగా నీళ్లుఇస్తామని చెప్పినటువంటి ఈ నీళ్లను ప్రతినెల 100 రూపాయలు చొప్పున ప్రజల తెలియజేయకుండానే తీసుకొని అవినీతికి పాల్పడతా ఉన్నారని. అంతేకాకుండా ఆర్మూర్ మున్సిపాలిటీలో బోర్లు చెడిపోతున్నాయని చెప్పి రిపేర్ల పేర్లతో ప్రతి బడ్జెట్లో పది లక్షల పైన బిల్లులు పెట్టడం జరుగుతా ఉందని. అదేవిధంగా రోడ్లలో మొహరం వేస్తున్నామని చెప్పి మరణం వెయ్యకుండానే లక్ష రూపాయలు వేచి చూస్తున్నట్లుగా రికార్డులలో దొంగ లెక్కలు చూపిస్తున్నారని ఎటువంటి కమిటీలు లేకుండా ప్రతిపక్షాలతో చర్చించకుండానే హిస్టారిచ్చిన వ్యవహరిస్తున్నారని అవినీతికి పాల్పడడం అక్రమాలకు పాల్పడడం దొంగలెక్కలు సమర్పించడంలో ఆది చేరిపోయినటువంటి మున్సిపాలిటీ కమిషనర్ను సస్పెండ్ చేయాలని దీంట్లో భాగస్వామ్యం మున్సిపాలిటీ చైర్మన్ రాజీనామా చేయాలని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్ సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజలు తరిమి వేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. టిఎస్ బిపాస్ ప్రకారం ఏదైనా పని చేసిన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారానే ఆర్మూర్ అభివృద్ధికి పాల్పడాలని అలాంటివేమీ లేకుండానే ఇష్ట రీతిన వ్యవహరించడం ( జిస్కే హత్ మే లార్టి - ఉష్ కా బైస్ ) ఎవరి చేతిలో కట్టే ఉందో వారిదే బర్రె నానుడిగా బి ఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఉందని. ఆర్మూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్న కలెక్టర్ సైతం నిసై జమైన అచేతన స్థితికి చేరుకున్నారని. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండడం మన ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని. ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి రాబోయే కాలంలో ఈ అవినీతి, అక్రమాలు చేస్తున్నటువంటి బి ఆర్ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి పంపించేయ్యా లని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin