సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొరివి సతీష్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు లు నియామక పత్రం అందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సతీష్ యాదవ్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు యాదగిరి తెలిపారు.అసోసియేషన్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా సతీష్ కు సూచించి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు.ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల స్థాయి నుండి అంచలంచెలుగా బాధ్యతలు అప్పగిస్తూ ఈనాడు రాష్ట్రస్థాయి కమిటీలోకి ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కి అదేవిధంగా రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అసోసియేషన్ అభివృద్ధి కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం చేసే ఉద్యమంలో అవిశ్రాంతంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రామచంద్ర రాజు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్సి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin