సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక రెవిన్యూ కార్యాలయంలో బుధవారం తహశీల్డర్ కనుకుంట్ల శ్రీధర్ చలివేంద్ర ఏర్పాటు చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వేసవి కాలంలో వివిధ పనుల కోసం కార్యాలయంకు విచ్చేసే ప్రజలకు తాగునీటి సౌకర్యం కలిపించేందుకు చలివేంద్ర శిబిరం ఏర్పాటు చేసారని పేర్కొంటూ వేసవి లో ప్రతి ఒక్కరు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం శ్రీ సత్య సాయి జిల్లా ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు చలివేంద్రం ఏర్పాటు చేసి శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీడీవో పోల్లప్ప ప్రారంభించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందువలన మండల అభివృద్ధి అధికారి కే .పోలప్ప మరియు విస్తరణాధికారి ఆర్ .రాజశేఖర్ మరియు పి రెడ్డప్ప ఏవో మరియు సిబ్బంది , విఆర్ఓలు ఆంజనేయులు, సుధాకర్,వెంకటరమణ,నరసింహలు,శివప్ప, గంగాధర్,లోకేశ్వరి,శ్రీలత,లక్ష్మిదేవమ్మ,నాగరాజు,సిఓ విశ్వనాధ్ రెడ్డి,విఆర్ఏలు రంగప్ప,నరసింహులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin