సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గోరంట్ల మేజర్ పంచాయతీ పరిధిలో శివాలయం కాలనీలో గ్రామ సభ నిర్వహించారు అందులో భాగంగా జెడ్పిటిసి పాలే జయరాం నాయక్ మాట్లాడుతూ నిమ్మల కిష్టప్ప మీ సొంతూరికి ఏం చేశావు. రెండుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీ గాను మంత్రిగా గోరంట్లకి ఏమి అభివృద్ధి చేశావు చెప్పాలని సూటిగా ప్రశ్నిస్తున్నామని గోరంట్ల మండల జడ్పిటిసి పాలే జయరాం నాయక్ మాట్లాడారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ సహాయ సహకారాలతో గోరంట్ల అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులం చూడం మతం చూడం పార్టీ చూడం అందరికీ జగనన్న సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న లక్ష్యం అని వచ్చే ఎన్నికల్లో 175 కు 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు . పెనుగొండ శాసనసభ్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ కు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు.
-----------------------
Admin