సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గిరిజనులకు ఇప్పుడున్న 6 శాతం నుండి 10 శాతానికి పెంచాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లు 10 శాతం పెంచాలనే డిమాండ్ తో భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు బయలుదేరిన పోరుయాత్ర శుక్రవారం కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా యాత్రకు పోస్ట్ ఆఫీస్ వద్ద బీఎస్పీ శ్రేణులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి వెంటనే పెంచాలని,కేంద్ర ప్రభుత్వ తరహా రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని,గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకోవాలని,గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈకార్యక్రమంలో ఇందల్ రాథోడ్, అశోక్ రాథోడ్, నీలా రవి నాయక్, రోహిత్, బీఎస్పీ జిల్లా మహిళా కన్వీనర్ వీణ, సాయి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin