Thursday, 30 July 2026 11:24:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మంలో వ్యాపారి ఐపీ దాఖలు...

Date : 07 February 2023 02:21 AM Views : 728

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరం బురహాన్ పురంకు చెందిన వ్యాపారి దందు బోయిన లక్ష్మణరావు వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీసినట్టు సోమవారం ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను 2015 నుండి శ్రీ తిరుమల నెట్ కేఫ్ పేరుతో ఇంటర్నెట్ వ్యాపారాన్ని ప్రారంభించానని, ప్రారంభంలో మంచిగా నడిచిన నెట్ కేఫ్ తదనాంతరం 2019 నుంచి కరోనా పరిస్థితుల మూలంగా వ్యాపారంలో నష్టం వాటిల్లడంతో. పరిస్థితులు చక్కబడతాయనే ఉద్దేశంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాన్ని కొనసాగించానని తన పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా వ్యాపారంలో వచ్చిన సొమ్ము ఏ నెలకు ఆ నెల అధిక వడ్డీలు తీర్చడానికి సరిపోయిందని, దీంతో అప్పులు ఇచ్చినవాళ్లు బలవంతంగా ఖాళీ ప్రాంసరీనోట్లు, చెక్కులపై సంతకాలు తీసుకుని వేధిస్తున్నారని , దీంతో విధి లేని పరిస్థితుల్లో ఆరుగురిని ప్రతివాదులుగా చేరుస్తూ 11 లక్షల 25 వేలకు దివాలా పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. కాగా తనకు గల ఆస్తులు వివరాలను కూడా పిటిషన్ లో తెలియజేశారు. పిటిషనర్ తరపున న్యాయవాదిగా దొంతిపోయిన రామారావు వ్యవహరిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :